సింగూరుకు పెరుగుతున్న వరద ఉధృతి

by Nagam Mallesh |
సింగూరుకు పెరుగుతున్న వరద ఉధృతి
X

దిశ, చౌటకూర్ : పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు ప్రాజెక్టు లోనికి వరద నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. మంగళవారం నాడు 24,845 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరిందని నీటి పారుదల శాఖ ఏఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు వరకు ప్రాజెక్టు లో 20.531 టీఎంసీలు నీరు నిలువ ఉండగా 24,845 క్యూసెక్కులు ఇన్ ఫ్లో నమోదయిందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ఇన్ ఫ్లో 24,845 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 401 క్యూసెక్కులు నమోదయిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed