గజ్వేల్ కు.. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం..

by Sumithra |
గజ్వేల్ కు.. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం..
X

దిశ, గజ్వేల్/ కొండపాక : రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను గాంధీభవన్ లో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా తనతో పాటు ప్రతి ఒక్కరు శ్రమించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం తాను ప్రతిక్షణం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, అలాగే పార్టీ నిబంధనలకు విధేయుడై కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు దక్కుతుందని తెలిపారు. ఇందుకు క్రింది స్థాయి నుంచి వచ్చిన తనను ఉదాహరణగా భావించాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షులు ఖర్గే, యువనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, అంకితభావంతో సీఎం రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఇప్పటినుండే ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని, పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న నేతలకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, ఆయా మండలాల బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్, రవీందర్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, నేతలు లక్ష్మారెడ్డి, వేలూరు భాస్కర్ రెడ్డి, మోహన్, సుభాష్ చంద్రబోస్, రాములు గౌడ్, జహీర్, హరినాథ్ గుప్త, కరుణాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, సమీర్, అమరేందర్, రామచంద్రా చారి, ప్రభాకర్ గుప్త, డప్పు గణేష్, కొడకండ్ల బాలు ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed