కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు

by Disha Web Desk 15 |
కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు
X

దిశ, హత్నూర : కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే సునీత రెడ్డి ప్రజలకు సూచించారు. హత్నూర మండల పరిధిలో రొయ్యపల్లీ, అక్వంచ గూడ ,శేర్ఖన్ పల్లీ, నాగారం, కొత్తగూడెం, రేండ్లగూడ, కొడిప్యాక, ఎల్లమ్మ గూడ, వడ్డేపల్లి, కొనంపెట్, చింతల్చేరు, రెడ్డిపాలెం, సాధుల్నాగర్, ముచర్ల, మల్కా పూర్, నస్తిపుర్, చందపూర్ , గుండ్లమాచునురు తదితర గ్రామాలలో ఎమ్మెల్యే సునీత రెడ్డి పర్యటించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు

సరఫరా సరిగా లేదని, 6 గ్యారంటీల పథకాలు 100 రోజుల్లో అమలు పరుస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్,బీజేపీ అబద్ధపు మాటలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు. మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఆయన విజయం ఖాయమన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ ఎస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed