కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసింది

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసింది
X

దిశ, హత్నూర : కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి ద్వారా నెలకు 2500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా దౌల్తాబాద్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి కార్నర్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఒకరు మతం పేరుతో మరొకరు రిజర్వేషన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని,

వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పై చెక్ బౌన్స్ కేసు నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది కేవలం బీ ఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రేషన్ బియ్యం దండాలను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మెదక్ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి తనకు

అవకాశం కల్పించాలని కోరా రు. ఎంపీగా గెలిచిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి, మాజీ లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఎంపీపీ వావిలాల నర్సింలు, వైస్ ఎంపీపీ పండుగ రవి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed