- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
'ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు'
![ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి... ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు](https://www.dishadaily.com/h-upload/2024/06/18/344074-web-image.webp)
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఓ పార్టీకి తొత్తులుగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11న చిన్నకోడూరు మండలం పరిధిలో జరిగిన ఓ వృద్దురాలి మృతి కేసులో విచారణ సాగుతున్న తీరును తప్పుబట్టారు. ఈ కేసులో నింధితుడిగా ఉన్న చంద్రశేఖర్ పేరిట తనతల్లి (మృతి చెందిన వృద్దురాలు) 2022లోనే ఆస్తి రిజిస్ట్రేషన్ చేసిందని ఆస్తీ తగాదాలు లేవన్నారు.
ఆస్తి విషయంలో దాయాదుల మధ్య వివాదం కొనసాగుతుండగా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఇదిలా ఉంటే తన పై ఉన్న కక్ష్యతో కొందరు పోలీసులు తన అనుచరుడిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో అనుమానాలు ఉన్నాయని థర్డ్ పార్టీ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి నిష్పాక్షిక విచారణ జరిగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. కేసులు చక్రధర్ గౌడ్ కు కొత్త కావని చట్టప్రకారం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.