మైనర్ బాలిక పై అత్యాచారం.. ముగ్గురు నిందితుల పై ఫోక్సో కేసు..

by Sumithra |
మైనర్ బాలిక పై అత్యాచారం.. ముగ్గురు నిందితుల పై ఫోక్సో కేసు..
X

దిశ, దుబ్బాక : దుబ్బాక మండలంలోని ఒక గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే బాలికకు ముగ్గురు యువకులు మాయ మాటలు చెప్పి, వేరు వేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడగా, బాలిక గర్భవతి కావడంతో, ముగ్గురు యువకుల పై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని ఒక గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆమెను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు.

వెంటనే వైద్యులు సిద్దిపేట భరోసా కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో, భరోసా కేంద్రానికి చెందిన అధికారులు గర్భవతి అయిన బాలిక నుంచి పూర్తి వివరాలను సేకరించారు. దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు, అక్బర్ పేట- భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు గత మార్చి, ఏప్రిల్ నెలల్లో బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి, లోబర్చుకొని పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకుల పై ఫోక్సో కేసు నమోదు చేసి, ఆదివారం రిమాండ్ కు తరలించారు. ఎవరైనా బాలికల పై, మహిళల పై అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎసీపీ హెచ్చరించారు. మీడియా సమావేశంలో సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై వి.గంగరాజు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed