- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపే వైఎస్ షర్మిల కొడుకు రిసెప్షన్.. హాజరు కానున్న ఖర్గే, కేసీ

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్లు శనివారం హైదరాబాద్కు రానున్నారు. ఏపీ పీసీసీ చీఫ్షర్మిల కొడుకు రిసెప్షన్కు హాజరు కానున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ రిసెప్షన్కు రానున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో ఖర్గే, కేసీలు ప్రత్యేకంగా భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నది.
వేర్వేరుగా తెలంగాణ, ఏపీ నేతలతో డిస్కషన్స్ చేయనున్నారు. ప్రస్తుత పార్టీ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. ఇక తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై ఖర్గే, కేసీలు సీఎంతో పాటు కేబినేట్ మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నది. త్వరలోనే తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించేందుకు తగిన కార్యచరణను కేసీ పార్టీ నేతలకు వివరించనున్నారు.
Next Story