Mahesh Kumar Goud : ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించనున్న మహేశ్ కుమార్ గౌడ్.. ఆ తెల్లారే సీఎంతో కలిసి అక్కడికి!

by Prasad Jukanti |
Mahesh Kumar Goud : ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించనున్న మహేశ్ కుమార్ గౌడ్.. ఆ తెల్లారే సీఎంతో కలిసి అక్కడికి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పీసీసీగా నియమితులైన బి.మహేశ్ కుమార్ గౌడ్ ఈ నెల 15వ తేదీన గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తున్నది. బాధ్యతల స్వీకరించిన మరుసటి రోజే పీసీసీ హోదాలో ఆయన సీఎంతో పాటు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. పీసీసీ పదవి నుంచి దిగిపోయాక రేవంత్ రెడ్డికి, పీసీసీ బాధ్యతలు చేపట్టాక మహేశ్ కుమార్ కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన కానున్నది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్య వర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed