Khairatabad Ganesh: అట్టహాసంగా ప్రారంభమైన మహాశక్తి గణపతి శోభాయాత్ర

by Mahesh |
Khairatabad Ganesh: అట్టహాసంగా ప్రారంభమైన మహాశక్తి గణపతి శోభాయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ముందస్తుగానే సోమవారం అన్ని చర్యలు తీసుకున్న నిర్వాహకులు, పోలీసులు మంగళవారం తెల్లవారు జామునే అనుకున్న సమయానికి శోభాయాత్ర ప్రారంభించారు. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్‌లో 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా సూపర్ క్రేన్‌ని తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారు జామునే శోభాయాత్ర ప్రారంభం అయినప్పటికి వందల సంఖ్యలో ప్రజలు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed