- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సమయపాలన పాటించని ఆసుపత్రి సిబ్బంది..
దిశ,మాగనూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం మండలానికి చెందిన ఓ గర్భిణీ స్త్రీ డెలివరీ కొరకు ఆసుపత్రికి రాగా రెండు గంటలు వేచి ఉన్న సిబ్బంది డాక్టర్లు లేకపోవడం విశేషం. హాస్పిటల్ సిబ్బందితో పాటు అధికారులు కూడా సమయపాలన పాటించట్లేదనె ఆరోపణలు గత కొద్ది రోజులుగా ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రతిరోజు విధులకు అక్కడున్నటువంటి సిబ్బంది సరిగా హాజరుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులు సమయపాలన పాటించే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గురువారం రెండు గంటలు వేచి చూసిన గర్భిణీ విషయం తెలుసుకున్న ‘దిశ’ పత్రిక డాక్టర్ ను ప్రశ్నించగా నేను ఇటీవలే ఆసుపత్రికి కొత్తగా వచ్చాను.. ఇంతవరకు ఇటువంటివి తమ దృష్టికి రాలేదని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు ఆమె దిశ పత్రికకు తెలిపారు.