మంత్రి.. మామిడి చెట్టు ఎక్కి…జనంతో ఇష్టాగోష్టి

by Disha Web Desk 11 |
మంత్రి.. మామిడి చెట్టు ఎక్కి…జనంతో ఇష్టాగోష్టి
X

దిశ , మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మామిడి చెట్టు ఎక్కారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని బోడబండ తండాకు చేరుకున్నారు. మామిడి చెట్ల క్రింద సమావేశం ఏర్పాటు చేయడంతో.. అక్కడి వాతావరణం.. చిన్ననాడు తన సోదరునితో కలిసి మామిడి చెట్లు ఎక్కుతూ ఆడుకున్న అంశాలను మంత్రి జనం ముందు గుర్తు చేశారు. అనంతరం ఆయన మామిడి చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చొని జనంతో మాట్లాడారు. ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి మంత్రి జూపల్లి తండావాసులకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి కి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి జూపల్లి చెట్టు ఎక్కి , కొమ్మపై కూర్చుని చేసిన ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు.



Next Story

Most Viewed