Collector : విద్యార్ధులకు మంచి అలవాట్లు నేర్పించాలి..

by Sumithra |
Collector : విద్యార్ధులకు మంచి అలవాట్లు నేర్పించాలి..
X

దిశ, కొల్లాపూర్ : విద్యార్థులకు న్యాన్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వంట ఏజెన్సీలను ఆదేశించారు. కొల్లాపూర్ మండలం సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన రిజిష్టర్ లను పరిశీలించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల, హాజరు శాతాన్ని పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడితో అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ వంట గదిని పరిశీలిస్తూ సరుకులు, వండే విధానాన్ని గమనించారు. భోజనం నాణ్యత పై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. మధ్యాహ్నం భోజనం బిల్లులు కూడా సకాలంలో అందుతాయని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని రుచికరంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న 97 మంది విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్ఎంకు సూచించారు.

పదిలో పదికి పది వచ్చేలా విద్యార్ధులకు మంచి బోధన అందించాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలని, వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ భాదావత్ సంతోష్ సూచించారు. అనంతరం కలెక్టర్, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. జిల్లా కలెక్టర్ విద్యార్ధులతో ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని, పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఇప్పటి నుండే బాగా చదవాలని, ఏ సబ్జెక్టులో నైన వెనుకబడి ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజ్, కొల్లాపూర్ తహశీల్దార్ విష్ణువర్ధన్ రావు, ఎంపీడీవో మనోహర్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్ గౌడ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ విష్ణు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed