- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఎన్టీఆర్ కళాశాల పీజీ లో కొత్త కోర్సులు ప్రారంభం
![ఎన్టీఆర్ కళాశాల పీజీ లో కొత్త కోర్సులు ప్రారంభం ఎన్టీఆర్ కళాశాల పీజీ లో కొత్త కోర్సులు ప్రారంభం](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348296-kk.webp)
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్ర విద్యా శాఖ ఈ విద్యా సంవత్సరంలో స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మూడు పీజీ కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రత్యేకంగా 'దిశ' తో మాట్లాడుతూ రాష్ట్రంలోనే 3 వేల మంది విద్యార్థులతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గా ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల నిలిచినందున 2022 విద్యా సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు అనుమతిచ్చి, ఎంఎస్సీ జువాలజీ కోర్సుతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
మహిళా విద్యను ప్రోత్సహించే దిశగా ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మూడు పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ లో రసాయన శాస్త్రం, గణితశాస్త్రం, ఎంఏ లో తెలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ప్రారంభించే కోర్సులోని ప్రతి సబ్జెక్టులో 60 సీట్ల చొప్పున అడ్మిషన్లు జరుగుతాయని, ఈ ప్రక్రియలో భాగంగా కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు.
ప్ర
తినిధి,మహబూబ్ నగర్:
రాష్ట్ర విద్యా శాఖ ఈ విద్యా సంవత్సరంలో స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మూడు పీజీ కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రత్యేకంగా 'దిశ' తో మాట్లాడుతూ రాష్ట్రంలోనే 3 వేల మంది విద్యార్థులతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గా ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల నిలిచినందున 2022 విద్యా సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు అనుమతిచ్చి, ఎంఎస్సీ జువాలజీ కోర్సుతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మహిళా విద్యను ప్రోత్సహించే దిశగా ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మూడు పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ లో రసాయన శాస్త్రం, గణితశాస్త్రం, ఎంఏ లో తెలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కొత్తగా ప్రారంభించే కోర్సులోని ప్రతి సబ్జెక్టులో 60 సీట్ల చొప్పున అడ్మిషన్లు జరుగుతాయని, ఈ ప్రక్రియలో భాగంగా కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు.