- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యం : ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్
దిశ, వీపనగండ్ల: నాగర్ కర్నూల్ ఎంపీగా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే అందరికీ అండగా ఉండటంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని కల్వరాల వీపనగండ్ల గ్రామాలలో పర్యటించారు. అనంతరం కల్వరాల గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. వారు నెల రోజులైనా ఉపాధి కూలీ డబ్బులు రావడం లేదని చెప్పడంతో వెంటనే చరవాణి ద్వారా అధికారులతో మాట్లాడి కూలీలకు ఇబ్బంది కలిగించొద్దని, త్వరగా డబ్బులు ఇచ్చే విధంగా చూడాలని ఆయన కోరారు. దేశంలో మోడీ హవా నడుస్తుందని, యువతకు అండగా మోదీ నిలుస్తారని ఆయన అన్నారు.
దేశంలో ఎదురు లేని శక్తిగా మారిన మోదిని గెలిపించి యువకుల సత్తా ఏమిటో చూపించాలని, రేపు జరగబోయే పోలింగ్ లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శేఖర్ గౌడ్, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, మండల అధ్యక్షుడు రాకేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కేశవులు, అసెంబ్లీ కో కన్వీనర్ అన్వేష్ తదితరులు ఉన్నారు.