ఇప్పటూరులో యువతి అదృశ్యం..

by Sumithra |
ఇప్పటూరులో యువతి అదృశ్యం..
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని ఇప్పటూరు గ్రామానికి చెందిన కొడిగంటి శిరీష అనే 21 సంవత్సరాల యువతి ఈనెల 23వ తేదీ నుంచి కనిపించడం లేదని తండ్రి శాంతయ్య శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు శిరీషను ఈ నెల 23వ తేదీ ఇంటి వద్ద ఒంటరిగా వదిలి తాను తన భార్య లక్ష్మమ్మ కార్కొండ గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి తన కూతురు కనిపించలేదని, ఆమె కోసం గత వారం రోజులుగా ఎంతగానో వెతికామని, అయినా ఆమె ఆచూకీ లభించలేదని, అందువల్ల శిరీష ఆచూకీ కనుగొని తమకు అప్పగించాలని కోరుతూ శాంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.

Next Story