- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత పై ఎంపీ డీకే అరుణ ఫైర్
by Sumithra |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జడ్చర్ల పెద్ద గుట్ట పై ఉన్న రంగనాయక స్వామి దేవాలయం కోనేరును ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా పూడ్చి వేస్తారని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ సంఘటన పై ఆదివారం ఆమె 'దిశ' తో ఫోన్ లో మాట్లాడుతూ జడ్చర్ల సీఐ ఆదిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశానని, నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేత పై సమగ్ర విచారణ జరిపించి, ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎంతటివారినైనా వదలోద్దని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను శిక్షించాలని, హిందువుల మనోభావాలను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
Advertisement
Next Story