వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేది బీజేపీ పార్టీనే : ఈశ్వరప్ప

by Disha Web Desk 23 |
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేది బీజేపీ పార్టీనే  : ఈశ్వరప్ప
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం కృషి చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప అన్నారు.స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారంటే,ఒబీసీ లకు ప్రధాని ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారా గమనించాలన్నారు.20 వేల కోట్ల నిధులతో మత్స సంపద పథకం ద్వారా మత్స్య కారులకు సహకారం అందించిందని,బీసీ కమిషన్ కు రాజ్యాధికారం హోదా కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ కే దక్కుతుందని ఆయన కొనియాడారు.

పథకాలు ప్రకటించడమే కాకుండా దళారులు లేకుండా నూటికి నూరుపాళ్ళు నిధులు లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా చేరుతుందని,దేశంలో 45 కోట్ల మంది రైతులకు పంట సహాయం కింద సంవత్సరానికి 6 వేల రూపాయల నగదును రైతు ఖాతాల్లోకి వేస్తుందని,22 రకాల పంటలకు కనీస మద్దతు ధరను రెట్టింపు చేసిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోడీ దేనని ప్రశంసించారు.ఆయన ప్రతినిధిగా జిల్లాలోని ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి ప్రధానిగా మోడీ కి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఒబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్,శంకరుల రవికుమార్,తరుణ్,నారాయణ యాదవ్,రాజేష్,కమలేకర్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story