హామీల అమలులో కాంగ్రెస్ విఫలం : డీకే అరుణ

by Disha Web Desk 23 |
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం  :  డీకే అరుణ
X

దిశ, మద్దూరు, కొత్తపల్లి: రాష్ట్రంలో హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి మండల కేంద్రంలో,మద్దూరు మండలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ మన గ్రామాలలో ఉపాధి హామీ పథకం మోడీ ఇచ్చాడు,మనం రోజూ పనులకు వెళ్తున్నాం కాబట్టి, 13వ తేదీన అందరూ ఓటు హక్కును వినియోగించుకొని కమలం పువ్వు గుర్తు కు ఓటు వేయాలని కోరారు.రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఎరువులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు ఎరువులు అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని తెలిపారు.పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు దేశవ్యాప్తంగా ఇళ్లు కట్టిస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజలకు అందించకుండా మోసం చేసింది అని అన్నారు. బ్యాలెట్ బాక్సులో ఒకటో నెంబర్ కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డీకే అరుణ కోరారు.

Next Story

Most Viewed