తల్లి గర్భంలోనే శిశువు మృతి

by Naveena |   ( Updated:2024-10-07 15:57:39.0  )
తల్లి గర్భంలోనే శిశువు మృతి
X

దిశ, గద్వాల రూరల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాన్పు కోసం వస్తే కడుపుకోత మిగిలింది. సమాచారం ప్రకారం..జిల్లా కేంద్రంలోని కేపీఎల్ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ కోసం మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామానికి చెందిన నాగరాణికి అడ్మిట్‌ చేశారు. కాన్పు చేసే సమయంలో కడుపులో ఉన్న చిన్నారి మృతి చెందడంతో..కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింప చేశారు. కుటుంబ సభ్యులకు హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story