BREAKING: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం.. రైలుకింద పడి తండ్రీ, కూతురు బలవన్మరణం

by Shiva Kumar |
BREAKING: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం.. రైలుకింద పడి తండ్రీ, కూతురు బలవన్మరణం
X

దిశ, వెబ్‌‌డెస్క్: తండ్రీ, కూతురు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏనుగొండ శ్రీరామ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన శివానంద్ (50), చందన (20) వరుసకు తండ్రీ, కూతురు. అయితే, తండ్రి శివానందర్ కారు డ్రైవర్‌గా, చందన ల్యాబ్ టెక్నిషియన్‌గా పట్టణంలోని ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఇంట్లో కుటుంబ కలహాలతో విరక్తి చందిన ఇద్దరూ రైలు కిందపడి బలన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మృతులను వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Next Story