సీఎం రేవంత్ రెడ్డికి మిడ్జిల్‌లో ఘన స్వాగతం

by Mahesh |
సీఎం రేవంత్ రెడ్డికి మిడ్జిల్‌లో ఘన స్వాగతం
X

దిశ, మిడ్జిల్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయదశమి సందర్భంగా తొలిసారిగా తన సొంత గ్రామం అయిన కొండారెడ్డిపల్లి చేరుకొన్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విజయదశమి సందర్భంగా జమ్మి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గాన మిడ్జిల్ మీదుగా కొడంగల్ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల కేంద్రంలో ఆగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభిమానులకు ముఖ్యమంత్రి కరచాలనం, అభివాదం చేస్తూ మండల ప్రజలకు ముఖ్యమంత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నేరుగా జడ్చర్ల మీదుగా కొడంగల్ కు బయలుదేరారు. ముఖ్యమంత్రి పర్యటన లో భాగంగా మిడ్జిల్ మండల ఆగేందుకు షెడ్యూల్‌లో లేకున్నా తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల కేంద్రంలో ఆగి అభిమానులకు కరచలనం చేయడం అభివాదం చేయడం పట్ల మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కి స్వాగతం పలికిన వారిలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గౌస్, సంపత్ కుమార్, వెంకటయ్య, రామ్ గౌడ్, జహంగీర్, డిష్ బాల్రెడ్డి, హరి గౌడ్, కృష్ణ, శివ, వెంకటయ్య, మల్లికార్జున్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story