తాగిన మైకంలో భార్య గొంతు కోసిన భర్త..

by Disha Web Desk 23 |
తాగిన మైకంలో భార్య గొంతు కోసిన భర్త..
X

దిశ,నాగర్ కర్నూల్ : కట్టుకున్న భార్యను తాగిన మైకంలో కత్తి పీట తో గొంతు కోసి హత్య చేసిన ఈ ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం..వనపట్ల గ్రామానికి చెందిన భూషి పాక రాములు, జ్యోతి ఇద్దరికి 20 ఏళ్ల కిందట పెళ్లి అయింది. రాములు తాగుడుకు బానిసై జ్యోతి తో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.ఈ క్రమంలో గురువారం మాట మాట పెరిగి జ్యోతి ని కత్తి పీట తో గొంతు కోసి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed