400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అంటూ ప్రచారం.. విపక్షాలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు అంటూ ప్రచారం.. విపక్షాలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే తమకు 400 సీట్లే అక్కర్లేదన్నారు. 400 సీట్లు లేకున్నా ఆర్టికల్370 రద్దు చేశామని గుర్తు చేశారు. పదేళ్లలో ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని.. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తెలిపారు. తమ పార్టీని విస్తరించడానికే 400 సీట్ల నినాదం అని క్లారిటీ ఇచ్చారు. మెజారిటీని దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీని దుర్వినియోగం చేసిందన్నారు. రాజ్యాంగంలోని అధికరణాలను మార్చారు. లోక్ సభ పొడిగించారు.. ఎమర్జెన్సీ విధించారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే లక్షా పాతికవేల మందిని జైళ్లలో వేశారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చామని 400 సీట్లు లేకున్నా సాధారణ మెజారిటీతోనే ఇవన్నీ చేశామని అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి మెజారిటీని ఉపయోగించామని తెలిపారు.



Next Story