- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రవాదాన్ని ఉపేక్షించొద్దు : భారత్ సమ్మిట్లో విదేశీ ప్రతినిధులు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దని కొందరు విదేశీ ప్రతినిధులు పేర్కొన్నారు. పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడి దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారని, ఇందుకు ఇండియన్పీపుల్స్ కు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వరల్డ్ వైడ్గా ఉగ్రవాదాన్ని ఆరికట్టేందుకు అడుగులు వేయాలన్నారు. ఈ సమ్మిట్లో ఉగ్రవాదం రూపుమాపే దిశగా ఆలోచన చేసి, ప్రపంచానికి ఒక ఈ సమ్మిట్ద్వారా మెసేజ్ఇవ్వాలన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ శుక్రవారం ప్రారంభమైన భారత్సమ్మిట్కు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు భారత్సమ్మిట్నిర్వాహకులు ఏర్పాటు చేసిన నులు రాట్నం, తెలంగాణ ప్రభుత్వం ఎగ్జిబిషన్, భారత సమ్మిట్లోగో ఫోటో సెషన్ఇతరత్ర ప్యానల్డిస్కషన్హాళ్లను ప్రత్యేకించి సందర్శించారు.
కొందరు విదేశీ డేలిగెట్స్నులు రాట్నం నుంచి నులు వలికేందుకు ప్రయత్నించారు. ఇండియా నులురాట్నానికి సంబంధించి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసి ఈ భారత్సమ్మిట్ ను విదేశీ డెలిగేట్స్ గ్రేట్ సమ్మిట్గా అభివర్ణించారు. అలాగే, భారత సమ్మిట్లోగో ఫోటో సెషన్ వద్ద విదేశీ డెలిగేట్స్ ఐక్యత, శాంతి, సామరస్యం నెలకొల్పేందుకుప్రపంచ దేశాలు సంఘటితం కావాలని తమ ఫోటోలతో సంకేతాన్ని ఇచ్చారు.