లిక్కర్ స్కాం కేసు : ఉదయం 11 దాటినా ఈడీ విచారణకు హాజరు కాని కవిత

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 05:58:05.0  )
లిక్కర్ స్కాం కేసు : ఉదయం 11 దాటినా ఈడీ విచారణకు హాజరు కాని కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కానున్నారు. కాగా కవిత ఈడీ విచారణ హాజరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉండగా 11.30 గంటలైనా కవిత విచారణకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉదయం 10 గంటలకే ప్రెస్ మీట్ అని కవిత ప్రకటించారు. ప్రెస్ మీట్ సైతం కవిత నిర్వహించకపోవడం గమనార్హం.

ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. అయితే న్యాయ నిపుణులతో కవిత భేటీ అయినట్లు సమాచారం. మరో 20 నిమిషాల్లో ఈడీ విచారణకు కవిత వెళ్లనున్నట్లు తెలిసింది. ఈడీ విచారణకు వెళ్లేందుకు కవిత ఇంటి వద్ద ఎస్కార్ట్ వాహనం సిద్ధంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed