ఇంత నికృష్ట రాజకీయమా.. కాంగ్రెస్‌ పార్టీపై KTR సంచలన ట్వీట్

by Disha Web Desk 4 |
ఇంత నికృష్ట రాజకీయమా.. కాంగ్రెస్‌ పార్టీపై KTR సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మేడిగడ్డ డ్యామేజీ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. కాపర్ డ్యామ్ కడతామని ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరమ్మతులు వద్దు అని ఉత్తమ్ ఆదేశించడం పట్ల కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమ్మతులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా ఎల్ అండ్ టీ కంపెనీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్ గారిని బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుంది. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?’ అని ట్వీట్ చేశారు. అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అయ్యర్ కమిటీ సిఫారసులొచ్చాకే రిపేర్లు చేపట్టాలని నీటి పారుదల శాఖకు ఆదేశించారు.

Next Story

Most Viewed