కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు KTR బహిరంగ లేఖ.. గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని రిక్వెస్ట్

by Rajesh |
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు KTR బహిరంగ లేఖ.. గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారని తెలిపారు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు. 10 సార్లు కేంద్రానికి లేఖలు, కేంద్రమంత్రులకు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ సారి అయినా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని బండికి కేటీఆర్ సూచించారు. పవర్ లూమ్ క్లస్టర్ వస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు తీరుతాయని తెలిపారు. నేతన్నలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారని, కానీ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు గానీ సిరిసిల్ల నేతన్నలకు గానీ బండి సంజయ్ పదవీకాలంలో జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులను, పరిశ్రమలను తరలించుకుపోతున్నారనితెలిపారు. కనుక తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed