- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వరదలపై.. బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి కీలక సూచనలు
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల పై నేతలతో చర్చించారు. అలాగే.. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో వర్ష ప్రభావిత పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం వరద సహాయక చర్యల్లో ప్రతి బీజేపీ కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని కిషన్రెడ్డి ఆదేశించారు. అలాగే దేశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న బీజేపీ సభ్యత్వం నమోదుపైనా కిషన్ రెడ్డి తమ పార్టీ నేతలతో చర్చించారు. దీంతో పాటుగా ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ కీలక నేతలతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి చర్చించారు.
Advertisement
Next Story