- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
![తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు](https://www.dishadaily.com/h-upload/2024/06/28/346926-neeru.webp)
దిశ,నేలకొండపల్లి : తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలు తీసుకుని ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఖమ్మం, కోదాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని
నెలలుగా తాగునీరు సరఫరా చేయకపోతే తాము ఎలా జీవించాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆ పైపులు కూడా పగిలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని నిరసన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ని పునరుద్ధరించారు.