- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భారీ మెజారిటీతో వినోద్ రావును గెలిపించాలి
దిశ,తిరుమలాయపాలెం : కాలం చెల్లిన కమ్యూనిస్టు, అస్తిత్వం కోల్పోతున్న కాంగ్రెస్, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కో- ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావ్ తో కలిసి ఆదివారం తిరుమలాయపాలెం మండలంలో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ప్రజలు మరోసారి నరేంద్రమోడీ ప్రధాని కావాలని కోరుతున్నారని అన్నారు.
దేశ సంక్షేమం కోసం మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలని ఆయన కోరారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్డు షో కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెలపల్లి నరేంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి ప్రసాద్, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాస్ రెడ్డి, నల్లగట్ల శ్రీనివాస్, లక్ష్మణ్ రెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.