SP Rohit Raju : సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి..

by Sumithra |
SP Rohit Raju : సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి..
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా టీఎస్ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మావోయిస్టుల కదలికల పై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story