- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆదరించండి అభివృద్ధి చేస్తాం
దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, అయినా ఖమ్మం అభివృద్ధికి నోచుకోలేదని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఖమ్మం అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్రావు సతీమణి తాండ్ర వినీలరావు అన్నారు. 53వ డివిజన్లో గురువారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఖమ్మంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని,
కేంద్రంలో మోడీ సహకారంతో జిల్లా అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు జిల్లాకు చేసింది ఏమీ లేదని, కేంద్రం ఇప్పటికే అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి దేశ ప్రజలను అన్ని రంగాల్లో ముందుంచిందన్నారు. తన భర్త వినోద్ రావుకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే జిల్లా మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ధనియాకుల వెంకటనారాయణ యాదవ్, మంద సరస్వతి, విజయ రెడ్డి, నాగరాజు, రవీందర్, భద్రం, శ్రీలత పాల్గొన్నారు.