ఎంపీ రేణుకా చౌదరి పరువు తీసిన ఖమ్మం కార్యకర్త

by Disha Web Desk 9 |
ఎంపీ రేణుకా చౌదరి పరువు తీసిన ఖమ్మం కార్యకర్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ రేణుకా చౌదరికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆమెను ఏ కార్యకర్త ఎదురు ప్రశ్నించడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమైన రేణుకా చౌదరి మాట్లాడుతూ.. మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో వచ్చి కూర్చున్నారని, కానీ అందరూ నాకు కనపడటం లేదన్నారు. అన్ని ఏరియాస్ నుంచి మండల అధ్యక్షులు ఎందుకు రాలేదని, ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు, నాటకాలు, మోసాలు మానేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై మీకు పదవులు కావాలంటే ఏ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తామని రేణుక చౌదరి అన్నారు. ఆమె వ్యాఖ్యలకు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ చేశారు. ‘మీరు ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తే ఎలా?’ అని ఓ కార్యకర్త ప్రశ్నించారు. దీంతో రేణుకా చౌదరి.. నువ్వూ ఎవడ్రా చెప్పడానికి అంటూ కార్యకర్తపై ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed