పేరూరు ప్రజలతో ఎమ్మెల్యే తెల్లం..

by Sumithra |
పేరూరు ప్రజలతో ఎమ్మెల్యే తెల్లం..
X

దిశ, భద్రాచలం టౌన్ : ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పేరూరు గ్రామం విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుని మండల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. భద్రాచలం టూ వాజేడు వరకు ప్రధాన రహదారి మరమ్మత్తులు చేయాలని స్థానికులు తెల్లంకి తెలిపారు. రాష్ట్ర రహదారులు శాఖ మంత్రివర్యులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం సమర్పించాను. త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

అనంతరం పేరూరు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం ఇచ్చి ఆరోగ్యం నయం వరకు చికిత్స పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story