కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించండి : బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్, తాండ్ర వినోద్ రావు

by Disha Web Desk 15 |
కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించండి : బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్, తాండ్ర వినోద్ రావు
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అందులో కొత్తగూడెం, ఖమ్మం ఉండాలంటే బీజేపీ ఎంపీని గెలిపించాలని పలువురు వక్తలు కోరారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి బస్తర్ మహారాజు, కాకతీయ వంశ వారసుడు మహారాజా కమలచంద్ర భంజ్ దేవ్, బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు, నాయకులు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి మధ్య మధ్యలో ప్రచార రథం దిగి దుకాణదారులను, ఇళ్లలోకు వెళ్లి ఓట్ల అభ్యర్థించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్ మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈసారి బీజేపీకి ఇవ్వాలని కోరారు. తన మిత్రుడు వినోద్ రావు కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని, మీరు ఆశీర్వదించాలని కోరారు. ఆయనను గెలిపించిన తర్వాత రెండేళ్లలోపు అర్హులైన

ప్రతి ఇంట్లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మీ ఇంటికి అందజేస్తారని తెలియజేశారు. కట్టెల పొయ్యితో బాధపడుతున్న మహిళలకు బీజేపీ ఉజ్వల పథకం కింద రాయితీ గ్యాస్ అందించిందన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలతో ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులను మా రాష్ట్రమైన ఛత్తీస్గడ్లో ఓటు దెబ్బతో వారిని ఇంటికి పంపించారని తెలిపారు. భారతదేశంలో ఎటువంటి సంక్షోభం వచ్చినా ప్రధాన మంత్రి మోడీ వెనక్కి తగ్గేది లేదని సరిహద్దుల్లో సైతం శత్రువులను గడ గడ లాడించారని, కరోనా సమయంలో ఆ పార్టీ ఈ పార్టీ లేదని కాంగ్రెస్ వారికి సైతం ఉచితంగా కరోనా కట్టడి వ్యాక్సిన్ అందించినట్లు గుర్తు చేశారు. నా పేరు కమల్ అని పోలింగ్ రోజున కమలం పువ్వు గుర్తు బటన్ నొక్కితే నన్ను ఆశీర్వదించినట్లేనని, ఇది బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు గెలుపునకు దోహదపడుతుందన్నారు.

బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు మాట్లాడుతూ... కొత్తగూడెం ప్రజల్ని చూస్తుంటే 1000 ఏనుగుల బలం వస్తుందన్నారు. మనతోపాటు మన ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నారు. ప్రధానమంత్రి మోడీని అడిగి మంచి ఆసుపత్రి, ఐటీ హబ్ తెచ్చుకుందామన్నారు. కేటీపీఎస్ మూతపడుతుందని, దాని పునర్ వైభవానికి కృషి చేస్తానని చెప్పారు. సింగరేణి కూడా విస్తరించాలన్నారు. ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చి రవాణా సౌకర్యం మరింత మెరుగుపరుస్తానని తెలిపారు. దేశంలో సంక్షోభాలు, కరోనా సమస్య వచ్చిన ప్రధాని మోడీ ప్రజల మధ్యలో ఉండి పాలన చేశారని గుర్తు చేశారు. నా ఎన్నికల ప్రచారానికి వచ్చిన బస్తర్ మహారాజ్ కమలచంద్ర ఖమ్మం సమస్యను వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ మాట్లాడుతూ మే 13వ తేదీన ఈవీఎం బ్యాలెట్ నాలుగో నెంబర్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కొత్తగూడెం ప్రజలను విజ్ఞప్తి వేశారు.

Next Story