Godavari floods: ఇళ్లలోకి చేరిన గోదావరి వరద నీరు

by Mahesh |
Godavari floods: ఇళ్లలోకి చేరిన గోదావరి వరద నీరు
X

దిశ, బూర్గంపాడు: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకు 51.1 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో వరద ఉధృతికి బూర్గంపాడు మండల కేంద్రంలోని శివారు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు పునరావాసం బాట పడుతున్నారు. ముంపు బాధితులు పునరావాస బాట పట్టడం ఇది వారంలో రెండోసారి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. సాయంత్రానికి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బూర్గంపాడు-సారపాక గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో పోలీసులు రాకపోకలు నిలిపి వేశారు.



Next Story