పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నిర్బంధం

by Sridhar Babu |
పంచాయతీ కార్యాలయంలో  కార్యదర్శి నిర్బంధం
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో రాచరుపల్లి పంచాయతీ సెక్రటరీని పంచాయతీ కార్యాలయంలో కొందరు వ్యక్తులు మంగళవారం నిర్బంధించారు. దీంతో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలం రాచురపల్లి పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి రవిని తాళ్ల పవన్, గిద్దా సాయి అనే వ్యక్తులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు, దోమల మందు ఫాగింగ్ చేయడం లేదని ఆఫీసులో నిర్బంధించారు. దీంతో గ్రామస్తుల సహకారంతో బయటకు వచ్చిన పంచాయతీ సెక్రటరీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించారని పోలీస్ స్టేషన్లో తాళ్ల పవన్, గిద్దా సాయి లపై ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed