ఆయన ఆదేశంతోనే కాంగ్రెస్‌లో చేరా.. పార్టీ మార్పుపై MLA సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Sumithra |
ఆయన ఆదేశంతోనే కాంగ్రెస్‌లో చేరా.. పార్టీ మార్పుపై MLA సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పు అనంతరం ఇవాళ కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు కార్యకర్తలు నడవాలని కోరుతున్నానని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్‌లో చేరి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని, అదే తరహాలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. నా చేరికపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం లేదని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక వ్యహరహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన హై కమాండ్ జీవన్ రెడ్డిని బుజ్జగించింది.

Advertisement

Next Story

Most Viewed