మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి

by Sridhar Babu |
మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తం గా ఉండాలి
X

దిశ, జగిత్యాల టౌన్ : మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. డ్రగ్స్ అవేర్నెస్ లో భాగంగా తీసిన స్పేస్ షార్ట్ ఫిలిం ట్రైలర్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని, అయితే వాటిని కట్టడి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, వృత్తి నైపుణ్యాలు, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి పై దృష్టి సారించాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆలోచింపజేసే విధంగా షార్ట్ ఫిల్మ్​ తీసిన బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed