అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా..: జగిత్యాల ఎమ్మెల్యే

by Aamani |
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తా..:  జగిత్యాల ఎమ్మెల్యే
X

దిశ, జగిత్యాల టౌన్ : నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రూరల్ అర్బన్ మండలాలకు చెందిన లబ్దిదారులకు పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 149 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.కోటి 49 లక్షల 17 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను, 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాల కోసంరూ. 14 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు.

వరద ప్రభావిత వార్డులకు కలెక్టర్ రూ.50 లక్షలు మంజూరు చేశారని త్వరిత గతిన పనుల ప్రక్రియ మొదలు పెట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తహసిల్దార్ లు రామ్మోహన్,శ్రీనివాస్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ప్రజా ప్రతినిదులు. రెవెన్యూ సిబ్బంది,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story