గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్

by Aamani |
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్
X

దిశ,జగిత్యాల టౌన్: గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీఎస్పీ లు, సీఐ లతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనోత్సవం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు.

అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిని బైండోవర్ చేయాలన్నారు. నిమజ్జనోత్సవానికి అవసరమైన క్రేన్స్, లైటింగ్స్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్వయంతో నిమ‌జ్జ‌నాన్ని విజ‌య‌వంతం చేయాలని, శాంతియుత వాతావరణంలో వినాయకుని నిమజ్జనం జరగాలని, దానికి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిచాలని కోరారు. ఈ సమావేశంలో డిఎస్పీలు రఘుచంధర్, ఉమా మహేశ్వర రావు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అరఫ్ అలీ ఖాన్, లక్ష్మీనారాయణ, సీఐ లు వేణుగోపాల్, రవి, కృష్ణ రెడ్డి,సురేష్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed