ప్రజా సమస్యలపై పోరాడినవారే తిరిగి ప్రజా ప్రతినిధులు గా నియామకవుతారు : ఎమ్మెల్యే కవ్వంపల్లి

by Aamani |
ప్రజా సమస్యలపై పోరాడినవారే తిరిగి ప్రజా ప్రతినిధులు గా నియామకవుతారు : ఎమ్మెల్యే కవ్వంపల్లి
X

దిశ, గన్నేరువరం: ప్రజా సమస్యలపై పోరాడిన వారు, గ్రామాల అభివృద్ధిని ఆకాంక్షించిన వారు తిరిగి ప్రజాప్రతినిధులుగా నియామకం అవుతారని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన చివరి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీల గడువు ముగుస్తుండటంతో చివరి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ని, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా గుణం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ఉన్న నాయకులు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుందని సూచించారు.

పదవులనేవి గొప్ప బాధ్యతలని భావించి ప్రజా సేవ చేయాలని సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యేక అధికారులు తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ నూతన మండలం గన్నేరువరం జిల్లాలో ఆదర్శ మండలం గా తీర్చిదిద్దే బాధ్యత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీసుకోవాలని అన్నారు. మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. తమ పదవులు ముగిసిపోవడంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపి మండలాన్ని అభివృద్ధి పథంలో అధికారుల సహాయంతో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తీగల శంకర్, తహసీల్దార్ బిక్షపతి, ఏవో కిరణ్మయి, ఎస్ఐ తాండ్ర నరేష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Next Story