నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ప్రభుత్వ విప్ అడ్లూరి

by Aamani |
నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ప్రభుత్వ విప్ అడ్లూరి
X

దిశ,పెగడపల్లి : వినాయక నిమజ్జనం ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలంతా సంతోషముతో కలిసి మెలిసి జరుపుకునే పండుగ వినాయక నవరాత్రులు అని అంతే సంతోషంతో ఐక్యంగా నిమజ్జనం కూడా జరుపుకోవాలని ఆ గణేశుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. అదే విధంగా పార్టీ నాయకులతో మాట్లాడుతూ శని వారం రోజున ధర్మారం మండలం కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు లు రాబోతున్న నందున ఆ కార్యక్రమం కి మండలం నుండి నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.వారి వెంట మాజీ జెడ్పీటీసీ రాజేందర్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగలి శ్రీనివాస్, నాయకులు కడారి తిరుపతి,కుంచె రాజేందర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed