- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం రేవంత్ కూడా బీజేపీలోకి వస్తాడు
దిశ, జగిత్యాల ప్రతినిధి : త్వరలోనే కాంగ్రెస్ లీడర్లు చాలా మంది బీజేపీలో చేరతారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తాడని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. శనివారం జగిత్యాల పట్టణంలో అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి లోపల హిందుత్వం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రకాలుగా నష్టపోయిందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తో పాటు ట్రిపుల్ తలాక్ తీసుకువస్తామని అంటున్నారని మండిపడ్డారు. అరబ్ దేశాలు ఒకరికి మించి ఒకరు హిందూ దేవాలయాలు
కడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో దర్గా కట్టారని విమర్శించారు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎందుకో చెప్పాలని అరవింద్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. సీఏఏ ను కాంగ్రెస్ లీడర్లు ఎందుకు విమర్శిస్తున్నారో ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. దేశమంతటా ఒకే విధమైన విధానాలు ఉండే విధంగా ఎందుకు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జెండా ఎజెండా అంటూ ఏమీ లేదని, తమను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండానే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భోగ శ్రావణి, స్థానిక లీడర్లు తదితరులు పాల్గొన్నారు.