రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఆర్.వి కర్ణన్

by Aamani |
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఆర్.వి కర్ణన్
X

దిశ, జగిత్యాల టౌన్: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆర్.వి కర్ణన్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గూర్చి డాక్టర్లను అడిగి తెలుసుకోవడంతో పాటు, హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని పరిశుభ్రత, అలాగే డంపింగ్ యార్డ్ చెత్తను ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఫ్యామిలీ సర్వేలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. కుటుంబ నిర్ధారణ వివరాలు తప్పులు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాస్, డీహెచ్ ఓ సమీ యుద్దీన్, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed