కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? ఆదిలాబాద్ రైతులపై లాఠీచార్జి ఘటనపై హరీశ్ రావు

by Prasad Jukanti |
కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? ఆదిలాబాద్ రైతులపై లాఠీచార్జి ఘటనపై హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో:సాగునీరు, కరెంట్ మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీ ఛార్జి ఘటనపై ఆయన స్పందించారు. రైతులపై లాఠీ ఝలిపించడం దారుణం అత్యంత బాధాకరం అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన హరీశ్ రావు.. కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పి, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed