సీఎం కేసీఆర్ పై ఇందిరా శోభన్ ఫైర్

by samatah |
సీఎం కేసీఆర్ పై ఇందిరా శోభన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇందిరా శోభన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని ఆ కుర్చీ తుప్పు పట్టిందిగాని పోడు భూములకు పట్టాలు రాలేదని విమర్శించారు. శనివారం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన ఆమె పోడు భూముల విషయంలో కేసీఆర్ మళ్లీ పాత పాడే పాడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే పోడు భూముల పంపిణీ విషయంలో అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేస్తామని, అటవీ భూములను ఆక్రమించబోమని గిరిజనులు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే వారికి పోడు భూముల పట్టాలిస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ముఖమేనా అని విమర్శించారు. హమీ పత్రం ఇస్తేనే పట్టాలు ఇస్తామంటున్న కేసీఆర్ మాటలు చూస్తుంటే పోడు భూముల విషయంలో సీఎం కు చిత్తశుద్ధి లేదని అర్థం అవుతోందని దుయ్యబట్టారు.


Next Story