రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే.. మాకు సుప్రీం కోర్టు గేట్లున్నాయ్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

by Shiva |
రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే.. మాకు సుప్రీం కోర్టు గేట్లున్నాయ్: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే.. తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. మళ్లీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీది గురివింద గింజ వైఖరి అని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడి లాంటి తెలంగాణ వ్యతిరేక నాయకుల సంకలో రేవంత్ ఉన్నాడంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటింటికీ తిరిగి ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ మాట్లాడేటప్పుడు సోయు ఉండి మాట్లాడాలని సూచించారు. దేశంలో జరుగుతున్న అనర్థాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అని ధ్వజమెత్తారు. నాడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరింది ఆ పార్టీ వైఖరి నచ్చకనే అన్నారు. కానీ, నేడు బలవంతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.



Next Story