హైదరాబాద్ ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తాం

by Sridhar Babu |
హైదరాబాద్ ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తాం
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ ను దేశ క్రీడా రాజధానిగా మారుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతలైన సిరియా ఆటగాళ్లను ముఖ్యమంత్రి అభినందించారు. భారత్‌ తో జరిగిన మ్యాచ్‌లో సిరియా విజయం సాధించింది. దీంతో సిరియా ఈ ఎడిషన్ విన్నర్‌గా నిలవగా, ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ఆ జట్టుకు ఇంటర్ కాంటినెంటల్ కప్-2024 ను అందజేశారు. మూడు దేశాల మధ్య మూడు (రౌండ్ రాబిన్ ఫార్మేట్ ) మ్యాచ్ ల టోర్నమెంట్‌ ను ఈనెల 3న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

అలాగే ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను, నిర్వాహకులను అభినందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం హైదరాబాద్‌ కు కల్పించినందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ ను దేశ క్రీడా రాజధానిగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించారంటూ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డితో పాటు ఇతర నిర్వాహకులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ ముగింపు ‌వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఏ హరిస్, సెక్రటరీ జనరల్ అనిల్ కుమార్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed