- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోదీతోనే అన్ని వర్గాలకు న్యాయం : కిషన్ రెడ్డి
దిశ, అంబర్ పేట: ప్రధాని మోదీతోనే దేశంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గత పదేండ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పేదల సంక్షేమం కోసం, దేశ ప్రగతి కోసం, మోదీ పనిచేశారని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని కేంద్రంలో ఒక మైనార్టీని, దళితుడిని, గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీ దేనని కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర కేబినెట్ లో అత్యధిక మంది బీసీలకు మోదీ అవకాశం కల్పించారని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రధానిగా భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన మోదీ ఒక బీసీ నేత అని గుర్తు చేశారు. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించి, ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మోదీ లక్ష్యం అని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.
గత పదేండ్లలో బీఆర్ఎస్ తెలంగాణ సంపదను దోచుకున్నదని అందుకే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపారన్నారు. ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్న ఈ రెండు పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని కిషన్ రెడ్డి సూచించారు. మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించాలని, సికింద్రాబాద్ నుంచి తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు. ఈ సమ్మేళనంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ నాయకులు ఆనంద్ గౌడ్, సుభాష్ గౌడ్, భరత్ గౌడ్, సుప్రియ గౌడ్ తదితర గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More..